టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ నేటితో 40 ఏళ్లు పూర్తిచేసుకుని 41వ ఏటలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడు నెలకొల్పిన పలు రికార్డులపై ఓ లుక్కేద్దాం.
ధోనీ సారథ్యంలో టీమ్ఇండియా 3 ఐసీసీ ట్రోఫీలు (ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2007, ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2011, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2013) సాధించింది. భారత కెప్టెన్లలో ధోనీకే ఈ ఘనత దక్కింది.
వన్డే ఛేదనల్లో 47 సార్లు నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ రికార్డుకు దరిదాపుల్లో ఏ ఆటగాడు కూడా లేడు. ధోనీ నాటౌట్గా ఉండి టీమ్ఇండియా ఓడిపోయింది రెండుసార్లే.
వన్డేల్లో కెప్టెన్ కమ్ వికెట్ కీపర్గా 6641 పరుగులు చేసిన ఏకైక ఆటగాడు ధోనీయే. మొత్తం 350 మ్యాచ్లు ఆడి 200 మ్యాచ్ల్లో టీమ్ఇండియాకు సారథ్యం వహించాడు.